Posts

Showing posts from January, 2015

సమ సమాజం - సమదర్సనం

సంస్కృత భాష గురించి సరైన అవగాహన లేని ప్రజా నాయకులు సామాన్య భారతీయుడిని ఎంతగా తప్పు దారి పట్టిమ్చారో తెలుసు కొంటే బాధ ,నిర్వేదం కలుగుతుంది . పెరియార్ లాంటి మహా మేధావి వేదాలను చెత్త కింద తీసిపారేసి తగల బెట్టాలని పిలుపు నిచ్చాడు . పూలే మహాశయుడు తనకున్న అత్యంత మానవతా విలువులున్న మేధతో ఒక అమాయకపు ప్రస్న  వేశాడు .  అందరికీ మేలు చేసే వేదాలు కేవలం సంస్కృత భాష లోనే ఎందుకు వ్రాశారు ? కానీ ఆయనకు తెలీదా ! అప్పట్లో ,10వేల ఏళ్ల  క్రితం జన భాష సంస్కృతమే అని ,మరే ఇతర భాషలు అప్పట్లో లేవని ,అందుకే సంస్కృతం లోనే వాటిని వ్యాస మహర్షి గ్రంధస్తం చేశారని ,గ్రంధస్తం కాక మునుపు,కేవలం గానం ద్వారా నే వేలాది ఏళ్ళు తరతరాలకు ప్రవహించాయని తెలీని అమాయకపు పెద్ద మనిషి ఫూలే ! అంబేద్కర్ గారు వేదాలను పనికిరాని చెత్త అని, అవి గిరిజనులు ప్రక్రుతి నుండి రక్షణ కోసం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రార్ధనా గీతా లని ,వాటికి పూచిక పుల్ల విలువ లేదని గర్జించి చెప్పారు . మనిషిలో మేధస్సు ,మానవతా విలువలు ఉన్నా విజ్ఞాన స్రవంతి పైన ఉపేక్ష ఉంటే,ఆ సమాజానికి, యువతకు  ఎంతటి నష్టం జరుగుతుందో...

అప్రాచ్యులు

గత 1000 ఏళ్లలో , పరమత సిద్దాంత దోపిడీ పాలక ముటాల చేతిలో , సనాతన భారతీయ సిద్దాంతాలను పాటించే భారతీయులు సుమారు 10కోట్ల మంది దుర్భర పరిస్థితులలో ప్రాణాలు విడిచారు . సుమారు 500 చిన్న చిన్న రాజ్యాలుగా విడగొట్టి దేశాన్ని ,జాతి వారసత్వాన్ని ,జాతి సంపదను ,జాతి నమ్మకాలను కాలరాచి ,కేవలం తమ అంతపురము,తమ రాచరికం,తమ జమీందారీ లు బాగుందా లనే స్వార్ధపు కార్పణ్యాలతో  బలహీనపడి ,సరిహద్దులు దాటి వచ్చిన తురుష్క ముష్కరులకు సలాం కొడుతూ సొంత జాతిని, మాతృభూమిని ఫణం గా పెట్టిన దౌర్భాగ్యులు ఎందఱో ! సంస్కృత భాషను, వేద సాహిత్యాన్ని అపాత్రులకు అందకూడ దనే వాదనతో తమ పొత్రాలలొ పాతరవేసుకొని ,అసలైన మతాన్ని , సనాతన ధర్మ సిద్దాంతాలను పక్కనపెట్టి కేవలం క్రతువుల పేరుతో జాతిని బలహీన పరిచిన ఒక వర్గపు కుటిల చాదస్తపు  మూర్ఖత్వానికి బలైన భరత జాతి మళ్ళీ పుంజు కొంటుం దా ? ప్రజాస్వామ్యం ,పరమత సహనం అనే వంకతో మెజారిటీ వర్గీయుల కు స్వేచ్చ లేకుండా ,మైనారిటీ ప్రజా రక్షణ అనే సాకుతో ఆటవిక ధర్మాలు, మూర్ఖపు వాదనలు, ఉగ్రపంధాలను చూసీ చూడక వదిలేస్తూ ,వారు గంప గుట్టగా కుమ్మరించే ఓట్ల కోసం అర్రులు సాచని రా...