అప్రాచ్యులు

గత 1000 ఏళ్లలో , పరమత సిద్దాంత దోపిడీ పాలక ముటాల చేతిలో , సనాతన భారతీయ సిద్దాంతాలను పాటించే భారతీయులు సుమారు 10కోట్ల మంది దుర్భర పరిస్థితులలో ప్రాణాలు విడిచారు .

సుమారు 500 చిన్న చిన్న రాజ్యాలుగా విడగొట్టి దేశాన్ని ,జాతి వారసత్వాన్ని ,జాతి సంపదను ,జాతి నమ్మకాలను కాలరాచి ,కేవలం తమ అంతపురము,తమ రాచరికం,తమ జమీందారీ లు బాగుందా లనే స్వార్ధపు కార్పణ్యాలతో  బలహీనపడి ,సరిహద్దులు దాటి వచ్చిన తురుష్క ముష్కరులకు సలాం కొడుతూ సొంత జాతిని, మాతృభూమిని ఫణం గా పెట్టిన దౌర్భాగ్యులు ఎందఱో !

సంస్కృత భాషను, వేద సాహిత్యాన్ని అపాత్రులకు అందకూడ దనే వాదనతో తమ పొత్రాలలొ పాతరవేసుకొని ,అసలైన మతాన్ని , సనాతన ధర్మ సిద్దాంతాలను పక్కనపెట్టి కేవలం క్రతువుల పేరుతో జాతిని బలహీన పరిచిన ఒక వర్గపు కుటిల చాదస్తపు  మూర్ఖత్వానికి బలైన భరత జాతి మళ్ళీ పుంజు కొంటుం దా ?

ప్రజాస్వామ్యం ,పరమత సహనం అనే వంకతో మెజారిటీ వర్గీయుల కు స్వేచ్చ లేకుండా ,మైనారిటీ ప్రజా రక్షణ అనే సాకుతో ఆటవిక ధర్మాలు, మూర్ఖపు వాదనలు, ఉగ్రపంధాలను చూసీ చూడక వదిలేస్తూ ,వారు గంప గుట్టగా కుమ్మరించే ఓట్ల కోసం అర్రులు సాచని రాజకీయ నాయకుడు లేని ప్రస్తుత భారత దేశం
 ఎలా అభివృద్ది చెందుతుంది ?

సనాతన ధర్మం అంటే జీవానికి/ ప్రాణా నికి  అత్యంత గౌరవం,పవిత్రతని ఇచ్చే సూత్రం .
 పశు వుదైనా ,మనిషి దైనా ప్రాణం విలువ ఒక్కటే అని భావన చేసే సనాతన ధర్మం జంతు హింస ని
 ఎలా ఒప్పు కొంటుంది ?
 " అహింస" పరమ ధర్మం గా ఉన్న సనాతన భారతీయ ఆచారాలను ,యజ్ఞాలను ,యాగాలను తమ వక్ర భాష్యాలతో వక్రీకరించి ,జంతువులును వధించె క్రతువులు గా కలుషితం చేసిన పరమత వాదులు- హూణులు ,రోమన్లు ,గ్రీకులు ,తురుష్కులు , మంగోలియన్ లు ,యూదులు ,పటాన్ లు ,క్రిస్తియన్లు -ఎవరైనా కావచ్చు ,పరదేసీయులు ,-ముఖ్యం గా యోరోపియన్ లు ,ముస్లిం దేశాల వారు కావచ్చు ; అలాగే కులాలు,శాఖలు ,వామాచారం ,కౌ లాచారమ్, వీర వైష్ణవం ,వీర శైవం ,శాక్తేయం ,గానాపత్యం  ఇలా చీలిపోయిన భారత సమాజం - వీళ్ళు పోని  పోకడలేదు ,వేయని వెర్రి లేదు .సనాతన ధర్మాన్ని  అంతగా భ్రష్ట్టు పట్టిం చేశారు .

మనో వాక్కాయ కర్మల ద్వారా ఏ ప్రాణికీ హాని  కలుగ చేయని జాతి సనాతన భారత జాతి !
"మాంస భక్షణం ,మత్తు పదార్ధ సేవనం, వ్యభిచారం, జూదము -ఇవి మనిషిని ని లువెల్లా కలుషితం చేసి నిర్వీర్యం  చేస్తాయి" -(Atharva VI.7-70-71) . 
దేవుడిచ్చిన శరీరం తో దైవ సృష్టిని నాశనం చేయ కూడదు . - Yajur Veda, 12.32. 

యజ్ఞం ' అంటే  జీవాల బలి కాదు ! యజ్ఞ,యాగము లలో జీవాలను వధిస్తారని సంస్కృత భాషని వక్రీకరించి చెప్పిన పెద్ద అబద్ధం . 
ఇతరుల ఆచారాలను ,అలవాట్లను ,భావాలను కించపరిచి తమతమ మతాలే అత్యంత నాగరికత తో ఉన్నవని నమ్మించి ,సనాతన భారతీయులకు వారి మతము ,ఆచారాలపై చులకన భావం,ఏహ్యత  కలగ చేయడానికి కంకణం కట్టుకొన్న కొంతమంది కరడు గట్టిన సిద్దాంతుల ముటా నిర్వాకం ఇది . 

మనిషి, పరాయి భావాలను ,పరాయి మనుషులను గౌర వించడం చాలా కష్టం . 
ఏదో ఒక విధం గా పరాయి భావాలను కించ పరిచి ,నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు . 

నిజానికి  యజ్ఞం అంటే , ఒక గొప్ప శుద్ది క్రియ .
 శరీరము, మనస్సు ,అంతకరణ -ఇవన్నీ సంపూర్ణ ముగా పవిత్రం చేయబడే క్రతువు(క్రియ లేదా  కార్యము)!
పవిత్రం అంటే ఏమిటి ?
 అహంకార నిర్మూలనం , దైవానికి సంపూర్ణ శరణాగతి .
 అలాగే ,శక్తి కొలది సృష్టి లోని ప్రాణులకు ,పర్యావరణానికి సాయపడటం . 
సత్ సంకల్పం ,సద్భావన ,సత్సాయం ,సత్కర్మ -ఇవన్నీ కలి పి  చేసేది యజ్ఞం . 

జాతర పేరుతో ,మొక్కు ల రూపేణ కోట్లాది జీవాలను బలి ఇచ్చే ఆచారాలు మన సొంతవి కాదు . ఆటవిక జాతులు చేసే అమాయక మూర్ఖపు చేష్ట లవి !

అహింస ,కరుణ ,పరోపకారం ,మనోవాక్ శరీర శుద్ధి ,నిర్హంకారమ్ ,వినయం - వీటిని అభ్యాసం చేయ మని చెప్పారు మహర్షులు .
 సనాతన ధర్మ సారదులైన మహర్షులు చెప్పిన సూత్రాలను, వారికి అనుగుణం గా మార్చు కొని కొత్త సిద్దాంతాల తో వేరే ప్రాంతాలలో సరి కొత్త మతాలను స్థా పించు కొన్న  కొందరు మేధావులు కూడా  శుభకరమైన అవే సూత్రాలను చెప్పారు . 
అంతే గానీ,నరుక్కోమని ,హేళన చేయమని చెప్పలేదు . 
కానీ మనిషి మారడు ! రోమన్ ల సామ్రాజ్యం కంటే రెండింతల రాజ్యాన్ని  గ్రీక్ చక్రవర్తి అలెగ్జాందర్ పాలించాడు . ఇతని కంటే నాలుగు రెట్ల రాజ్యాన్ని చెంగిజఖాన్ పాలించాడు . ఈ ఖాన్ కంటే నాలుగు రెట్ల భూమిని బ్రిటిష్ వారు పాలించారు .
గత 10వేల ఏళ్లలో ,  ఎ ప్రాంతం వారైనా ,సుమారు ఒక వేయి మంది చక్రవర్తుల సామ్రాజ్య కాంక్షకి ఎన్నో ప్రాణాలు
 పోయాయి .ఎన్నో దేశాలు ,జనపదాలు , గణతంత్ర రాజ్యాలు ,మానవ  జాతి యావత్తూ భ్రష్ట్టు పట్టి నాశన మయ్యాయి .
 ప్రార్ధనా మందిరాలు , మతాలు ,సిద్దాంతాలు ,నమ్మకాలు కూకటి వేళ్ళతో పెకలించ బడ్డాయి . 
ప్రాంతాలు ,మానవ సమూహాలు ,గ్రామాలు కలగా పులగ మయ్యాయి . 
క్షామం ,ఈతి బాధలు ,అంటు  వ్యాధులు ,యుద్దాలు -ఇవన్నీ మానవజాతిని ,భూమండ లాన్ని అతలా కుతలం చేశాయి . 
కొంతమంది కర్కోటకులు  , జ్ఞాన ధార ని తర్వాతి తరాలకు అందకుండా చేసి జాతులను 
పూర్తిగా నిర్వీర్యం చేశారు . ఇప్పటికీ చేస్తున్నారు . 
వేదాలకు పెడర్ధాలు తీసి ప్రచారం చేశారు . పురాణాలలోని మౌలిక వేదాంత భావనలను పక్కన పెట్టి ఉపమా అలంకారానికి సంబంధించిన వాటిని పెద్దగా ప్రచారం చేస్తూ ఎవరి బుద్ధికి తోచిన వి ధం గా వాఖ్యానాలు చేయడం 
చేశారు ,చేస్తున్నారు . 
సంస్కృత భాష కి  ఉన్న మౌలిక మైన వ్యాకరణ నియమాలు, నిరుక్తం ,పక్కన పెట్టి కుహనా పండితులను బెదిరించి , మభ్య పెట్టి ఇష్టమొచ్చినట్లు గా విపరీతార్ధాలు ప్రచారం చేయడమే పరమావధి గా పెట్టుకొన్న పరమత సంస్థలు 
ఎన్నో ఉన్నాయి . 
రామాయణము చదివి అమృతం దొరక బుచ్చు కోమంటే ,కేవలం విషాన్ని మాత్రమే కనిపెట్టి కక్కుతున్న  రచయిత్రులు ,
మహా భారతము లో  జీవితాన్ని మెరుగు పరిచే రహస్యాలు గ్రహించ మంటే , కేవలం  రంకు, బొంకు మాత్రమే గ్రహిస్తున్న సమాజం  ,
ఆ మధ్యన ఒక  చిత్రకారుడు  కోట్లాది మంది మనోభావాలు గాయ పడే విధం గా కేవలం ఒక మతానికి చెందిన దేవతల నగ్న చిత్రాలనే  చిత్రీకరిస్తాడు . ఆయన ఒక్కడి కళా తృష్ణ, కోట్లాది ప్రజల ను గాయపరిచినా ఆయన ను ఎవ్వరూ ఏమీ అన కూడదు . అలా అంటే మైనారిటీ లపై దాష్టీకం అని మీడియా సోదరులు చొక్కాలు చింపు కొంటారు . 
 శివుడిని ఒక మామూలు గిరిజన యోధుడు గా  ఒక మూడు నవలలు వ్రాసి పుక్కిటి పురాణాలు నేను బహు బాగా చెప్పగలను ' అని ఈ మధ్య ఓ రచయిత తలెగరేసాడు . 
గజినీ,ఘోరీ నుండి మొదలుకొని పర్షియా ,బ్రిటిష్,ఫ్రాన్స్,  ఐరోపా,గల్ఫ్ దేశాల   వారు  గత వేయి ఏళ్లుగా కేవలం ఒకేఒక  మతాన్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి మూర్ఖపు వేషాలు వేస్తున్నారు . 
అప్రాచ్యులు ఇలాంటి అప్రాచ్యపు చేష్టలు చేయక ఇంకేం చేస్తారు ?

ఇతరుల మనోభావాలను గౌరవించే భరత జాతి మనది . 
అందరూ అలాగే ఉంటారని ఆశించడం తప్పని ఇప్పటికైనా తెలుసుకొని, యువతని సనాతన విజ్ఞాన ధారలో శుద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ నడుం కడతారని కోరుకోవడం లో అత్యాశ లేదు !

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి