Posts

Showing posts from 2014

గురువులను సందేహించ వచ్చా ?

సద్గు రువులను సందేహించ కూడదు .గురువు అనే వారు నిస్వార్ధ జీవనాన్నిఅవలంబిస్తారు . అలాగే తాను  బోధించే వాటినీ ఆచరిస్తూ మార్గ దర్సకు డిగా ఉంటారు . అట్టి వారే సద్గురువులు .  కానీ ఇది ప్రజాస్వామ్య యుగం . ఎక్కడైతే స్వార్ధం ,పటాటోపం ,కాళ్ళు కడగడానికి ,వళ్ళు  పట్టడానికి భారీ ఫీజులు వసూల్ చేస్తున్నారో , ఎక్కడ భూకబ్జాలు చేస్తూ దందా లు జరుగుతున్నాయో   అలాంటి  ఆశ్రమాలకు పట్టిన గతి ని మనం చూస్తున్నాము .  కొంత మంది స్వాముల విషయం లో  మీడియా వాళ్ళు బూతద్దాలలో చూపించే ప్రయత్నాల ను  మనం  గమనిస్తున్నాము ముస్లిం మదరసాలు ,క్రైస్తవ సంఘాల భోదనాలయాలు ,హిందూత్వ పేరుతో ఎవరు తప్పు చేసినా వారిని సమాజం వెలివేయాలి .

Bhagavadgita-the manual for mankind!

We,as the nation of social democratic republic proud to have our own flag,bird,animal and logos etc... As the primordial womb of mankind and as the seeding field of intellectual civilization and as a cultural bed of spirituality,india has enormous literature that thrusts knowledge and wisdom. Bhagavadgita,the amalgam of all branches of wisdom should be declared as "global Manual for Mankind". in that process,why can't we ,as the divine nation adapt Gita as our national man ual? Some friends may ask,"Why can't be other religious books? Because all Religions are born and inspired from the sanatana(-Ancient) dharmic wisdom of Island jamboo. So,as the essence of sanatana dharma,Bhagavadgita is apt and suitable manuscript for all mankind. For that matter Gita is not constrained as a religious book. its a compass of life...its a core character developer,which is the need of the hour for all of us!

భౌతిక -ఆధ్యాత్మిక చింతన

మానవ జీవన విధానం ,మానవ పరిణామం , పురుషార్ధములు , మోక్షము , కర్మ చక్రము ,   జనన మరణ ములు ,ఇహలోక -పరలోకములు , చైతన్యము ,ఆత్మ నిత్యత్వం , -ఇవన్నీ భౌతిక ,ఆధ్యాత్మిక వాదుల మధ్య   విబేధాలు కలిగించే వాదనలు . "భౌతిక పదార్ధ -శక్తి శాస్త్రం" అవిద్య అని ఆత్మ నిత్య   వాద మే అసలైన సత్యమని, ఆత్మ స్థితికి చేర్చే శా   స్త్రములే    (పరా విద్య ) అని    ఆధ్యాత్మిక వాదులు అంటారు . ఆధ్యాత్మిక సాహిత్యం అంతా ట్రాష్ అని భౌతిక వాదులు తెగనాడతారు . పురుషార్ధాలు నాలుగు అని చెప్పినా ,మనిషి జన్మ లక్ష్యం మోక్షం ఒక్కటే ! సరే, దైవం మానవ జన్మ ఇచ్చింది దేని కోసం ? వనరులను అంది పుచ్చుకొని అనుభవించడ మే గమ్యమని భౌతిక వాదులు , ధర్మ చట్రం లో నే వనరులను అనుభవిస్తూ మోక్ష సాధన చేయాలని ఆధ్యాత్మిక వాదులు అంటారు . ఆధ్యాత్మిక వాదం - మానవ శరీరం   ని తొడుక్కున్న జీవాత్మ అనేక విధములైన కర్మలతో నిండి ఉంటుంది .   ఆయా కర్మల భారాన్ని తగ్గించు కోవడమో ,పూర్తిగా తొల గించు కోవడమో   చేయాలి . ఈ కర్మలను పూర్తిగా భస్మం చేసు కోవాలీ అంటే సత్కర్మల ద్వారా నే సాధ్య పడ...

గీతా గానం -1

వేద శాస్త్రి ,   వాద శ్రేష్టి   వైవిధ్య పాలెం ఊరు మధ్య నున్న చెట్టు కింద కూర్చొని బాతాకానీ వేస్తున్నారు. రాబోయే దసరా కి గుళ్ళో ఉత్సవాలకు కార్యక్రమాలు,పురాణ కాల క్షేపాలు ఏమేమి పెట్టాలా అని శ్రేష్టి అడిగాడు . గీతా ప్రవచనం పెడదాం,విని తరిస్తారు జనం అని బదులిచ్చాడు శాస్త్రి. కుర్రాళ్ళు రికార్డింగ్ డాన్సులు కావా లంటున్నారు,అన్నాడు శ్రేష్టి. అవన్నీ పాతరొజులు.ఇప్పుడు మన కుర్రజనం కూడ బాగా చదువుతున్నారు. పై చదువుల కెల్లే వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు భగవద్గీతలో బోలెడు ఉన్నాయి. కాబట్టి పూర్ణయ్య అవధానిని వెళ్ళి కలుద్దాం. నవరాత్రులుతొమ్మిది రొజులూ   నిత్య జీవితం లో గీతని ఎలా ఆచరణ లోకి తీసుకోవాలో   చెప్పమని అడుగుదాం. సరే అనుకొని , ఇద్దరూ మరి కొందరు గ్రామ పెద్దలతో కలిసి పూర్ణ అవధానిని కలిసి విషయం విన్నవించగా, ఆయన కూడా సరే నని మాట ఇచ్చాడు . నవ రాత్రి సంబరాలు మొదలయ్యాయి . పందిళ్ళు ,జంగిడీ జిలేబీలు ,పొంగళ్ళు, అంగళ్లు షురూ ఐనాయ్ . రాత్రి 7గంటలకు అవధాని గారు ప్రవచనం ప్రారంభించారు . నిత్య జీవితం లో సంతొషం గా ఉండా లనే ప్రతి మనిషి కోరిక. ఆ సంతొషం శాశ్వతం గా ఉండా లని అను...

గీతా జయంతి శుభా కాంక్షలు .

మిత్రులారా ! అందరికీ నమస్సులు .  మన సనాతన భారతా వనిలో ఎన్నో ఆరోగ్య కరమైన సంప్రదాయాలు ,ఆచారాలు ఉన్నాయి .  అయినా , పాశ్చాత్య నాగరికతా మోజులో ,సామాజిక సమాచార మాధ్యమం లో  మనవి కాని  సంప్రదాయా లను ఎన్నింటినో నేడు చూస్తున్నాము .  మన యువత కూడా వాటిని ఆచరించ డానికి ఎక్కువ మోజు చూపు తున్నారు .  వాటిని "ఆచరించ వద్దు" అని చెప్ప బోవడం లేదు .  మంచి అనేది ఎటు నుండి ,ఎక్కడ నుండి వచ్చినా స్వీకరించమని గాయత్రి మంత్రం మనకు చెప్పింది .  ఇతరుల సంప్రదాయాల లో మంచి చెడు ల గురించి కూడా  ఇక్కడ మనం చర్చించ నక్కర లేదు .  కనీసం మన విలువలను ,ఆచారాలను , సంప్రదాయాలను చూడండి .  వాటిని ఎలా నిల బెట్టు కోవాలో  ఒక్క సారి ఆలో చించండి .  స్వచ్చ భారత్ అంటే బయట ఉన్న మకిలి నే కాదు, మనలో గూడు కట్టు కొన్న మకిలిని కూడా  శుభ్రం చేసు కోవాలి .  దీనికి నాంది గా మనందరం రాబోయే గీతా జయంతి సందర్భం గా శుభా కాంక్షలు చెప్పు కొందాం .   సర్వ జనులకు , సర్వ లోకాల కు శుభం జరగా లనే ఆశతో శ్రీ కృష్ణుడు మనకి  ప్ర...

సత్యము -జ్ఞానము -అమరము

ఎవరెవరు సత్యాన్ని స్వీకరించి అసత్యాన్ని త్యజించటమనే ప్రాథమిక సూత్రానికి కట్టుబడి ఉంటారో, వారు ఎప్పుడూ భారత దేశాన్ని సందర్శించక పోయిననూ, ఏ భారత గ్రంథాలను చదవక పోయిననూ, వారందరినీ 'సనాతన ధార్మికులు’ అనవచ్చు.  ఇది "సత్యం అంటే మార్పు లేనిది,ఆది అంతములు లేనిది ,నిరంతరం ఆనందం ను ఇచ్చేది  " అనే భావనతో చెప్పిన మాట .  

మనసా ... ఓ మనసా

ఏక్ నిరంజన్ దగ్గరకు "సందేహం " వచ్చి అడిగాడు ...  మనస్సు కోతిలాంటి దని మనకు తెలుసు . మరి ఆ కోతిని ఎలా అదుపులో పెట్టాలి ?  దానికి ఒక తాడు కావాలి . దానినే మనం దైవం అంటాం . సరే తాడు కోతికి కట్టినా ఉపయోగం లేదు .  అప్పుడు ఆ తాడుని ఒక రాట కి కడతాం . ఆ రాటే మంత్రం లేదా ఒక రూపం -లేదా ఒక భావం . రోజుకి సుమారుగా 60000 ఆలోచనలు చేస్తుంది మనస్సు . వాటిలో మెజారిటీ ఆలోచనలు ఒకే విషయం గురించి అదీ వ్యతిరేక భావనలు ,రాజస తామస భావనలు ... భద్రతకు , అత్యాశ ,దురాశ కి చెందిన వై   ఉంటాయి . వీటన్నింటి నుండి మనస్సుకి విముక్తి కలి గించా లీ  అంటే ,మనస్సుకి ఏదో ఒక్క విషయం మాత్రమే ఇవ్వాలి . అదీ సాత్విక పరమైన అహంకార రహిత మైన భావం ఐతే మంచిది . సాత్విక ఆలోచనలు అంటే ఏవి ? నిస్వార్ధం , తృప్తి , సహనం , క్షమ ,కరుణ ,పరోపకారం , పరహితం ,పర్యావరణ హితం ,లోక కళ్యాణ కారకం ... వీటిని మన రోజు వారీ జీవనం లో అన్వయించు కొని మన " వ్రుత్తి - ప్రవ్రుత్తి -కుటుంబ -సంఘ " బాధ్యతలను నిర్వర్తించడం . ఇదే కర్మ యోగ మార్గం  . "దైవం ' అనే భావనలో సాత్వికత ఉంది . ఎలా గంటే, దైవం చె...

మనస్సు -బుద్ది -ఆత్మ

మనస్సుతో సుఖ దుఖాలను అనుభవిస్తాము . అదే మనస్సుతో స్థిత ప్రజ్ఞ నీ సాధిస్తాము . అదే మనస్సు ద్వారా భక్తినీ సాధన చేస్తాము . బుద్ది తో తప్పుడు నిర్ణయాలు లేదా మంచి నిర్ణయాలు తీసు కొంటాం . అదే బుద్ది తో వివేక విచక్షణ లను సాధిస్తాం . బుద్ది తో నే జ్ఞాన మార్గంలో సాధన చేస్తాం . ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా , ఎలాంటి విచక్షణా శక్తిని ఉపయో గించ కుండా కేవలం ఒక భావన -అనగా మనస్సు ,బుద్ది కన్నా సూక్ష్మ మైన స్థాయిలో పశ్యంతి స్థాయి -దానినే యోగ పరిభాషలో హృదయం అంటాం -చేయ డాన్ని ధ్యానం అంటాం. ఏ మాత్రం "అహం" అనే భావం లేకుండా సాక్షిత్వం గా ఉండి పోవడమే ధ్యానం . ఆత్మ అనేది వేరు అనుకోవడం అవిద్య - అదే అహం . ఆత్మ అనేది లేదు అనుకోవడం అజ్ఞానం . ఆత్మ ని మరచి పోవడం అమాయకత్వం . ఆత్మని "నేనే " అని శాస్త్రాల ద్వారా ,గురువుల ద్వారా విని ఓహో ' అని ఉండిపోవడం కుతూహలం . ఆత్మ అనేది నిజమని ప్రగాడం గా నమ్మి శాస్త్రాలు ,గురువులు చెప్పిన దాన ,జప, తపాలు ,షోడశ పూజలు ,స్తోత్రాలు చేయడం ఆధ్యాత్మిక సాధనకి తోలి మెట్టు . ఆత్మ పై అత్యంత శ్రద్ద తో అన్వేషణా పధం లో సద్ గురువు  సమక్షంలో క్రమ బద్దమైన జీవనం చేయడం...

సత్తు ని పెంచుకో ...

 ఏకం గా ఉన్న సత్య చిదానంద చైతన్యం స్వ ప్రేరణ తో శక్తి తరంగ సంపుటి ని కల్పించి రెండుగా మారి , త్రిగుణాల మేళ వింపుతో మాయా సృష్టిని ఆరంభించింది . ఈ మాయా మోహ సృష్టి లో సత్వ -రాజస -తామస "అనే 3 గుణాలు వేర్వేరు నిష్పత్తులలో మేళ వింప బడి రకరకాల తత్వాలు సృష్టింప బడ్డాయి . ఆ తత్వాల నుండి పంచ తన్మాత్రలు ,వాటి నుండి పంచ భూత తత్వాలు ,ఇలా సృష్టి బహుధా విస్తరింప బడింది . చైతన్యము తన శక్తితో మాయా మోహ  సృష్టి ప్రారంభించిన దశలో  త్రిగుణాల లోని సత్వము ఎక్కువగా ఉన్న పరామితులను(matrix or dimensions) ఊర్ధ్వ లోకాలని ,తామసం అత్యంత ఎక్కువ ఉన్న పరా మితులను అధో లోకాలని ఋషులు వర్గీక రించారు . ఈ రెండూ కలిసి రాజస గుణం పుట్టి కర్మ క్షేత్రం గా అవతరించిన దే భూలోకం . రాజసం అంటే కర్మ . ఇలా మూడు గుణాల శక్తులకు మధ్యన కలిగిన ,కలుగుతున్న వైరుధ్యం సంఘర్షణకు దారితీసి అల్లకల్లోలం ఏర్పడుతుంది .  సిస్టం లో సత్వ -తామస గుణ నిష్పత్తిలో విపరీత మైన తేడా నే అధర్మం అంటాము . లోకాలు అల్లాడుతూ ఉండ ట మంటే అదే . వ్యవస్థలో -అది ఈ అనంత సృష్టి కానివ్వండి , లేదా మన సమాజం కానీండి -సత్వ గుణం సరైన...

దైవ వాక్యం

Image
ఓ జీవి ప్రయాణం : పరబ్రహ్మ లోని ఓ శకలం స్వ లేదా దైవ ప్రేరణతో, మాయకు లోబడి ఆత్మ గా తన ప్రస్తానం మొదలు పెట్టింది . దాని గమ్యం "మాయ" ముసుగుని తొల గిమ్చు కొని, తాను అనుభవిస్తున్నట్లుగా భావించిన  త్రిగుణా త్మక మైన " కల " లాంటి ప్రయాణా న్ని ముగించి నిర్గుణ బ్రహ్మలో  .....   మనిషి తన ఇష్టానికి, కష్టానికి లేదా రాగ ద్వేషాలకు లోబడి తనకు తోచిన విధం గా  మాట్లాడతాడు,కర్మలు చేస్తాడు . మరికొందరు కీర్తి కోసం ,డబ్బు కోసం, బంధం కోసం, బాధ్యతల రీత్యా ,ఇతరుల కోసం , ఇతరులు చెప్పినట్లుగా చేస్తారు .  కానీ ,మనిషి దేవుడు చెప్పినట్లు ఎప్పుడు నడచు కొంటా డో అప్పుడే మనిషి సాధకుడు అవుతాడు . దేవుడు చెప్పింది ఇదీ' అని ఎవరు చెప్పారు ? సనాతన ధర్మం ,ఇంకా వివరం గా శృతి స్మ్రుతి పురాణాలు చెప్పాయి . ప్రస్తాన త్రయాలైన ఉపనిషత్ ,గీత ,బ్రహ్మ సూత్రం ' ద్వారా ఇంకా విడమరిచి చెప్పారు ఋషులు . ఏమిటా దైవ వాక్యం ? దైవ వాక్యం ఇదే -సకల సంకల్పాలను ,ఆలోచనలను ,కోరికలను ,కర్మలను కర్తృత్వ భావన లేకుండా(*నేనే చేస్తున్నాను అని కాక ) ,అదే సమయం లో కర్మ ఫలితాలపై ఎలాంటి ఆసక్త...

అంతర పూజ / అంతర్యాగం

ప్రస్తుతం మనిషి బాహ్యపరమైన పూజలకు ,ఆడంబరాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ,ఆయా హోమాలు, వ్రతాలు ,పూజల వెనక ఉన్న అంతరార్ధం పై దృష్టి పెట్టడం లేదు . భావ శుద్ది లేని కర్మలు రాజస ,తామస కర్మల వలనే బంధాన్ని బలపరుస్తాయి గానీ, దైవానికి దగ్గర కానివ్వవు . దానం,జపం,తపస్సు ఇవన్నీ సాత్విక పరమైన భావం తో ఉంటేనే మనిషి జన్మ లక్ష్యం ఐన ఆత్మ సాక్షాత్కారం సిద్దిస్తుంది . అంతర్ పూజ యొక్క ప్రాముఖ్యత నేడు ఏ పూజారులూ విడమరిచి చెప్పడం లేదు . ఆధ్యాత్మిక కార్యక్రమాల వెనక ఉన్న అంతరార్ధం ను ,అంతర్యాగం  యొక్క విశిష్టత ను చాటి చెప్పకుంటే మన సనాతన జ్ఞాన వాహిని  ఎండి పోతుంది . శబ్ద ,కాంతి తరంగ రూపులైన దైవీ శక్తులు  సాత్విక భావ శక్తికి తల వూచి మనిషి ని ఆధిదైవిక మార్గం లోకి ఆహ్వానిస్తాయి . బాహ్య పూజ ,స్తోత్రం ,జపం ,ధ్యానం , నిరంతర అంతర పూజ  -ఇవన్నీ ఒకదానికన్నా ఒకటి ఎంత మేలు చేస్తాయో ఈ చిన్ని పద్యం చూడండి - కోటి పూజ సమం స్తోత్రహ  కోటి స్తోత్ర సమో జపం  . కోటి జమ సమం ధ్యానం . కోటి ధ్యాన సమో లయం .   - లయ మంటే నిరంతర అంతర పూజ. మనిషి తన ...

కాల మహిమ

దేనికైనా కాలం కలిసి రావాలి .  వాడికి ఇంకా టైం రాలేదు . కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు . --- ఇలాంటి సామెతలు కాల మహిమ గురించి చెబుతాయి . 12 నక్షత్ర రాశుల గుండా సూర్యుడు చేసే  గమనం లో ప్రతి రాశిలోకి జరిగే ప్రవేశాన్ని సంక్రమణం అంటారు .  12 నక్షత్ర రాశుల గుండా గురు గ్రహం ప్రయాణం చేసినప్పుడు నదులకు పుష్కరాలు వస్తాయి . కాలాన్ని ,తద్వారా మానవ జీవితాలను అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసే వి వివిధ నక్షత్ర రాశులలో  జరిగే సూర్య, గురు, శని గ్రహాల గమనం. సూర్యుడు   అగ్ని స్వరూపమైన బుద్దిని ,చంద్రుడు జల స్వరూపమైన మనస్సును ,గురు గ్రహం వాయు  తత్వా న్ని ,శని గ్రహం పృధ్వీ తత్వా న్ని ప్రభావితం చేస్తాయి . తులా రాశి అన్నింటినీ సమానం చేస్తుంది . శని గ్రహం కూడా యమ ధర్మ రాజు లాగా  అందరికీ సమ న్యాయం అందే టట్లు చూస్తాడు . అందుకే కర్మలతో నిండి పోయిన మానవ జీవితాల పై అత్యంత తీవ్రమైన ప్రభావం చూపుతుంది శనిగ్రహం . కర్మ భారం తక్కువ ఉన్నవారిని ,ఆధ్యాత్మిక సాధన అనుష్టానం గా  చేస్తున్న వారిని  శనిగ్రహం అంత  ఎక్కువగా బాధి...

Clean the mind to Clean the world

మన మనస్సులు పరిశు ద్దం గా ఉంటే మనచుట్టూ ఉన్న పరిసరాలు కూడా శు భ్ర పడతాయ్ . మనస్సు శు ద్దం గా ఉన్నప్పుడు పరిసరాలను మనం పాడు చేయలేము .   ఎందు కంటే శు ద్దం గా ఉన్న మనస్సు ప్రతి జీవిని ,చెట్టు పుట్ట,పరిసరా లన్నింటినీ జాగ్రత్తగా కాపాడుతుంది .  మనుషుల్లో ఎప్పుడైతే ఆధ్యాత్మికత తగ్గిందో వాతావరణం ,పరిసరాలపై ప్రేమ కూడా తగ్గిపోతుంది .  అంతర శుద్ది బాహ్య శుద్ది కి దారి తీస్తుంది . 

‘కాడి ఎద్దులతో విద్యుత్‌ ఉత్పత్తి’

Image
‘‘100 చదరపు గజాల స్థలం మధ్యభాగంలో ఒక యంత్రాన్ని ఏర్పాటుచేయాలి. ఆ యంత్రం నుంచి విద్యుత్‌ తీగలను మోటర్‌ లేదా, లైట్లకు అను సంధానం చేయాలి. యంత్రం నుంచి ఒక రాడ్‌ను ఏర్పాటు చేసి దాన్ని ఎద్దులకు కట్టి గానుగను తిప్పినట్లు గుండ్రంగా తిప్పితే విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది .  ఎద్దు ,ఒక గంట పాటు తిరిగి  యంత్రాన్ని నడిపితే 9 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది . రైతులు  ఉపయోగించే 5 హెచ్‌పీ మోటర్‌కు గం టకు 4  యూనిట్ల విద్యుత్‌ ఉపయోగించుకోగా, మరో 5 యూనిట్ల విద్యుత్‌ మిగులుతుంది.  నెట్‌మీటరింగ్‌తో గ్రిడ్‌కు అనుసంధానం చేస్తే ప్రతి రోజు ఉత్తత్తి చేసే మిగులు విద్యుత్‌ను అమ్ముకునే అవకాశం.  ఇప్పటి కైనా మన రైతులు, ఆవులను ,ఎద్దులను సాకితే  పాడి పంట కి లోటు ఉండదని సనాతన ధర్మం చెప్పిన మాట నిజ మని నమ్మాలి .  

తిమిరం తో సమరం . అదే నవరాత్రి ఉత్సవ పరమార్ధం .

Image
పరా ప్రక్రుతి కి ఎలాంటి గుణాలు ఉండవు .  సత్వ ,రాజస ,తామస గుణాల కలయిక వలన అపరా ప్రక్రుతి సృష్టింప బడుతుంది . ఈ మూడు గుణాల వలన సకల స్థావర - జంగమాలు ఎలా ఏర్ప డ్డాయో ,అవే మూడు గుణాలు  విభిన్న నిష్పత్తి లో కలియడం వలన  పరిణామ పరంగా ఉన్నత జీవులలో  అరిషడ్వర్గాలు , మనస్సు ,చిత్తము ,బుద్ది ,అహంకారం ఉద్భ వించాయి . అమాయకత్వం(innocence) -అజ్ఞానం (ignorance)ఇవి రెండూ వేర్వేరు లక్షణాలు . రాత్రి అంటే అజ్ఞానం . అనగా అజ్ఞానం తో మసకబారిన మనిషి,తనలోని 3 శక్తులను ఉద్దీ పింప  చేసుకొని ఆ అజ్ఞానాన్ని రూపు మాపు కోవడానికి చేయ వలసిన సాధన కు , ఆశ్వీజ మాస శుక్ల పక్షం సరైన సమయం అని ఋషి వాక్యం . 9 రకాల లంపటాలు - 6 భేద భావాలు (అరిషడ్వర్గాలు ), కల్మష పూరిత మానసం , చిత్తం ,అహం -మొత్తం ఈ 9 రకాల బలహీనతలతో యుద్ధం చేయడమే నవరాత్రి దీక్ష . ఇచ్చా శక్తికి  లక్ష్మి ,జ్ఞాన శక్తికి సరస్వతి ,క్రియా శక్తికి దుర్గ - 3రకాల శక్తి కి ప్రతిరూపా లైన మువ్వురినీ ఆరాధించడ మంటే , ఆ 3 శక్తులను మన శరీరం, మనస్సు ,ఆత్మ పైకి ఆవాహన చేసు కోవ డమే . అదే శ క్త్యుపాసన ...

పని చేద్దాం ...

మనిషి బలమూ ,బలహీనతా మనస్సే .  ఎదుటి వాళ్ళు కష్టం లో ఉన్నప్పుడు మనస్సు కదిలి పోవడా న్ని దయ ,జాలి అని అంటాము . మనమే కష్టాల్లో ఉన్నప్పుడు మనలో కలిగే బాధ ని తలచు కొని కుంగి పోవడం  బలహీనతే(weakness)  గానీ , అందరూ భావిస్తున్నట్లు సున్నితత్వం కాదు . సున్నితత్వం (sensitivity)అంటే ఎదుటి వాడి కష్టానికి చలించి సాయం అందించడం . ఎక్కువ శాతం , మనిషి జాలి(pity) పడతాడు గానీ సాయం(help) చేయడానికి ఉత్సాహం చూపడు . కొన్నిసార్లు తన కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి సాయం చేస్తాడు గానీ ,పేద వారికి చేయడు . ఎందు కంటే మళ్ళీ తిరిగి సాయం చేస్తారని . ప్రతిఫలం లేకుండా మనిషి సాధారణం గా ఏ పనీ చేయడు . కర్మ ఫలం పై ఆపేక్ష పెంచు కొంటాడు . ప్రతిఫలం గారంటీ గా వస్తుందని కర్మ సిద్దాంతం చెబుతున్నా మనిషి నమ్మడు . నమ్మకం లేన ప్పుడే మనిషికి గాభరా ఉంటుంది . మనిషి కర్తవ్యము పని  చేసు కొంటూ పోవడమే గానీ , కర్మ ఫలం పై ఆపేక్ష ఉండ కూడదని గురు వాక్యం . సరే, మనిషి పని చేయాలి . సోమరిగా ఏమరు పాటు తో పలాయన వాది  గా ఉండకూడదు . మరి  ఆ చేసే పని, ఎలా చేయాలి ? మనిషి పుట్టుక , జ...

ఏది సుఖం ?

Image
ఏది సుఖం ? కొందరికి నిధి చాలా సుఖం . మరి కొందరికి రాముని సన్నిధి సేవ సుఖం .  ముందుగా ఓ విన్నపం .  ఏది సుఖం, ఏది దుఖం అనే చింతన జిజ్ఞాసువు కే గానీ , అటు ఎలాంటి మానస శోధన   లేని అజ్ఞానికి ,ఇటు అప్పటికే జ్ఞానం తో పండిన జ్ఞానికి అవసరం లేదు .  ముందు సుఖం గా ఉందనే భ్రమ కలిగించి తర్వాత దుఖానికి కారణ మయ్యె ప్రతిదీ  మనిషికి పనికి రానిదే .  కోరికలే  మనిషి కష్టానికి కారణం అని ఋషి వాక్యం .  వస్తువుల పైన ,విషయాల పైన మనిషికున్న వ్యామోహం ,దానితో మనలో కలిగే అలజడి ఆ కోరిక తీరడానికి పడ  వలసిన శ్రమ ,కష్టం ఇవన్నీ మనిషిని ఆందోళనకు గురి చేస్తాయి . నిజానికి కోరిక మనలో లేనప్పుడు మనిషి శాంతం గా ,సుఖం గా నే ఉంటాడు . ఎప్పుడైతే ఓ ప్రే రేపణ ,ఓ కోరిక , ఓ వ్యామోహం మనస్సులో మెదిలిం దో అప్పుడే మనస్సు కి సుఖం ఉండదు . ఆ కోరిక తీ రేంత  వరకు  ప్రశాంతత ఉండదు . కోరిక తీరి, కావలసింది దక్కిన తర్వాత మనస్సు పూర్వ స్థితి ,అనగా మునుపటి ప్రశాంత ,ఆనంద స్థితి కి వస్తుంది .  వస్తువు దక్కడం వలన ఆనందం వచ్చిందని అందరం అనుకొంటాం . కానీ ,నిజ...