గురువులను సందేహించ వచ్చా ?
సద్గు రువులను సందేహించ కూడదు .గురువు అనే వారు నిస్వార్ధ జీవనాన్నిఅవలంబిస్తారు . అలాగే తాను బోధించే వాటినీ ఆచరిస్తూ మార్గ దర్సకు డిగా ఉంటారు . అట్టి వారే సద్గురువులు . కానీ ఇది ప్రజాస్వామ్య యుగం . ఎక్కడైతే స్వార్ధం ,పటాటోపం ,కాళ్ళు కడగడానికి ,వళ్ళు పట్టడానికి భారీ ఫీజులు వసూల్ చేస్తున్నారో , ఎక్కడ భూకబ్జాలు చేస్తూ దందా లు జరుగుతున్నాయో అలాంటి ఆశ్రమాలకు పట్టిన గతి ని మనం చూస్తున్నాము . కొంత మంది స్వాముల విషయం లో మీడియా వాళ్ళు బూతద్దాలలో చూపించే ప్రయత్నాల ను మనం గమనిస్తున్నాము ముస్లిం మదరసాలు ,క్రైస్తవ సంఘాల భోదనాలయాలు ,హిందూత్వ పేరుతో ఎవరు తప్పు చేసినా వారిని సమాజం వెలివేయాలి .