Posts

Showing posts from 2018

ఓ మనిషీ!

మనిషికి మనస్సు ఒక వరం. నమ్మకం అనేది మరో గొప్ప వరం. ఇష్టమైనవి పొందాలని,అయిష్టమైనవి పోవాలని మనిషు అనుకొంటాడు.   ప్రగాఢమైన నమ్మకం అనేది ఓ పెద్ద వరం. నిజానికి,   మనుషుల్లో మనస్సు అనగా ఆలోచనా సామర్ధ్యం అనేది ఒక వరం. కానీ ఆ వరాన్ని మనం శాపం గా మార్చేసుకొన్నాం. గతాన్ని తవ్వుకొంటూ   మనకు భయాన్ని,జుగుప్సను, అవమానాన్ని,బాధను,ఆక్రోశాన్ని,ఆవేదనను ,కలిగించిన సంఘటనలను పదే పదే నెమరువేసుకొంటూ దుఃఖిస్తూ ఉండటం బాగా అలవాటై పోయింది. అంతేకాదు, భవిష్యత్ లో కలగబోయే బాధలు,దుఃఖాలు, అభద్రత గురించి ఆందోళన చెందడం కూడా మరింతగా అలవాటైపోయింది. ఇలా ప్రతిక్షణం ఏడుపుతో కుమిలి కునారిల్లిపోవడం మెజారిటీ మనుషులకు ఒక పెద్ద అలవాటుగా మారింది. సెక్స్,డ్రగ్స్, ఉప్పు, ఆల్కహాల్ కే కాదు దుఃఖపూరితంగా ఉండటానికి మనిషి బాగా అలవాటు పడ్డాడు . జీవితం ఇంత    దుఃఖభాజకంగా   ఉంటే దుఃఖపడకుండా ఎలాఉంటామండీ ? సరిగ్గా పరిశీలిస్తే నిజంగా దుఃఖాన్ని కలిగించే సంఘటనల కంటే ,దుఃఖాన్ని పదే పదే తలచుకొని కుమిలి పోవడమే ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, దుఃఖం ముంచెత్తు తుందేమో అనే భయం మనిషిని తడిపేస్తుంది. మరి సంతోషం కలగడం ల...

Indian farmers -Will they vote to Modi ? ??

Image
రై తు భారతం. మనదేశంలో గ్రామీణప్రాంతాలలో సుమారు 12 కోట్లమంది రైతులు,మరో 14కోట్లమంది వ్యవసాయాధారిత కూలీలు నివసిస్తున్నారు. అనగా మొత్తం గ్రామీణ జనాభా86కోట్లలో వ్యవసాయం అనగా పాడిపంటలు,పళ్ళతోటలు,పౌల్ట్రీ,చేపలు,గొర్రెల పెంపకం,తదితర అనుబంధ రంగాలలో వెరసి  30% (27కోట్ల జనాభా) పనిచేస్తున్నారు.  కాంగ్రెస్ పాలనపై రోత పుట్టి, మోడీ గారి కల్లబొల్లి మాటలు నమ్మేసి,  2014లో వీరందరూ,ముఖ్యంగా ఉత్తర,పశ్చిమ,మధ్య భారత ప్రాంతపు రైతులు   గంపగుత్తగా ఆయనకు ఓట్లేసి గెలిపించారు.  గత 4 ఏళ్లుగా మోడీగారు తీసుకొన్న కొన్ని నిర్ణయాల వలన దేశ ఆర్థికపరిస్థితి కుంగిపోవడమేగాక, రైతు చేతిలో డబ్బు తగ్గిపోయి,ద్రవ్యోల్పణం వలన మరింత దారిద్రంలోకి జారిపోయారు .  మరి వచ్చే ఎన్నికలలో వీరు మళ్ళీ మోదీగారికి ఓటేస్తారని  అనుకోలేం. అనగా సుమారు మూడోవంతు ఓట్లు మోడీ పోగుట్టు కొన్నారని అర్ధం అవుతుంది.   Farmers by land ownership (In %) Around 79% farmers are small & medium where 14% are landless farmer.  In that survey most of the farmers think tha...

faithful duty - శ్రద్ధ

ప్రతి   మనిషికీ ఏదో ఒక దానిపై   శ్రద్ధ ఉంటుంది. మనిషికి ఉన్న శ్రద్ధను బట్టి అతని ఆలోచన,కార్యాచరణ,అతని జీవితం ఎలాఉంటుందో చెప్పవచ్చు. అన్నప్రాసన సమయంలో పిల్లలకు వివిధ వస్తువులు ఎదురుగా పెట్టి,వారు దేన్ని పట్టుకొంటారో చూసి,దానిని బట్టి వారి ఇష్టాన్ని తద్వారా శ్రద్ధని చెబుతారు.   ఆ బిడ్డ   యెక్క   ఇష్టాన్ని,శ్రద్ధను చూసి అది బిడ్డ మానసిక   ఎదుగుదలకు, పురోగమనానినికి , ఆధ్యాత్మిక చింతనకు వ్యతిరేకమైనదా , సహాయ కారిగా ఉంటుందా? అనేది    బేరీజు వేసుకొని వ్యతిరేకమైనది అయితే ఆ బిడ్డను సంస్కరించడానికి తల్లితండ్రులు ,   గురువు ప్రయత్నం చేస్తారు . అన్నప్రాశన లో వెనుక ఉన్న పరమార్ధం ఇదే! ఏది ఏమైనా బిడ్డలకి 7 ఏళ్ళు ముగిసే లోపుగానే అనగా వారి మెదడు అభివృద్ధి చెందే దశలోనే,   వారికీ మంచి ఆలోచనలు,సాంఘిక విలువలు, ఆధ్యాత్మిక భావాలు ,పరోపకారం,సహనం,ఆరోగ్య రక్షణ పై అవగాహనా పెంచాలి.    శ్రద్ధ అనేది సంస్కృత పదం.   మనలో   గట్టిగా స్థిరపడిన భావనలను   శ్రద్ధ అంటాం. అనగా ఆ భావనలను మనం గట్టిగా ,బలంగా ఇష్టపడతాం. విశ్వసిస్తాం. కొందరికి చదువు ప...