Posts

Showing posts from July, 2014

అంతా చేసింది నువ్వే ...

ఈ సృష్టి భగవంతుని రచనా ? లేక యాదృచ్చికం గా జరిగిందా ? అసలు దైవం అనే శక్తి ఉందా ? లేక మనం భ్రమల్లో ఉన్నామా ? ఏదో పుట్టాం . పెరిగాం . సుఖదు ఖాలు చూశాం . చిరాకు -పరాకు ,అసూయ -అపనమ్మకం ,కోపతాపాలు,అవమానం -ఆక్రోశం ...ఇంకా ఎవేవో అనుభవాలు - అన్ని  ప్రాణుల మాదిరిగా నే అనుభూతి స్తున్నాం .  కాబోతే తెలివి,ఊహ ,తార్కిక బుద్ది ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా నే అనుభ విస్తున్నాము . ఏది ఎలా ఉన్నా , మనిషి సుఖం గా బతకడానికి జ్ఞానం కావాలి . ఆ జ్ఞానం, సుఖం తో పాటు ప్రశాంతత నివ్వాలి గానీ,ఆందోళన ,ఆవేదన ఇవ్వకూడదు అని వేదం గట్టిగా చెప్పింది . మనిషి గమ్యం ఆనందం . మనిషి కర్తవ్యమ్ కుటుంబ ,దేశ ప్రశాంతత . పాపం,పుణ్యం ,స్వర్గం,నరకం అని చెప్పి ప్రజలకు  భయ భక్తులు నేర్ప వలసిన అగత్యం వేద కాలం లో లేదు . ఎందు కంటే ఎక్కువ శాతం ప్రజలు ఆర్ధికం గా హార్ధికం గా  సమతుల్యతలో ఉండే వారు . అసమానతలస్సలేమీ ఉండేవి కావు . ఎప్పుడై  తే అసమానతలు ఎక్కువ అయ్యాయో అప్పుడే ఘర్షణలు మొదలయ్యాయి . ఆ గొడవలను నియంత్రించి సమాజం  శాం తం గా ఉంచటానికి కర్మ ,విధి ,పాపం,పుణ్యం ,స్వర్గం,నరకం అనే...

Expand the Horizons.

Image
మీరు గమనించే ఉంటారు ,ఆలోచన చేయా లన్నా , ఆలోచనలను ఆపా లన్నా మనకున్న ఏకైక ఆయుధం -మనస్సే .  మనిషి మనస్సులో  రోజుకి సుమారు 60000 ఆలోచనలు పుడతాయి. వాటి క్రమం ఇలా ఉంటుంది.   వాసన(instinct) - సంకల్పం(will) -ఆలోచన(thought) -వివేక విచక్షణలు (intellect &discrimination)- కార్యాచరణ(execution). మనిషికి మనస్సే - బంధనం.    మాయ కి ఉతమిచ్చేది ,చేధించే ది మనస్సే .  మూలాధార శక్తి అనేది మనిషి కి ఉన్న అద్భుత అవకాశం .  ఆ శక్తిని అధోముఖంగా , అనగా ప్రాపంచిక విషయ వాసనలకు ఆజ్యం గా ఉపయోగిస్తే కలిగే పరిణామాలు మనందరికీ తెలుసు .  అదే శక్తిని ఊర్ధ్వ ముఖం గా ఉపయోగిస్తే మన చైతన్యం క్రమేణా విస్తరింప బడి పరమ చైతన్యం లో మిళిత మవుతాము .  అంటే మనిషి ప్రాణం లేని జడ పదార్ధం లాగా ఉండాలా ?  అలా కాదు . అన్ని పనులు చేయాలి . అన్ని సంఘటనలను అనుభవించాలి .  మన చైతన్యం ప్రాపంచిక స్థాయికి పరిమిత మైనప్పుడు ద్వంద తత్త్వం- (రాగ ద్వేషం- సుఖ దుఖం ) ఉండటం వలన ఆయా  సంఘటనల నుండి ఉత్పన్న మయ్యె స్పందనలు - బాధ,సంతోషం -అనుభవిస్తాము .  ...

సావన్ కో ఆనే దో

దక్షిణాయనం,అనగా పొడుగు రాత్రులు ,పొట్టి పగళ్ళు ఉండే సమయం .  అలాగే మనుషుల్లో నకారాత్మక దృక్పధం పెచ్చరి ల్లె కాలం. ఉపాసకులు  దీక్షలు పట్టే  చాతుర్ మాసకాలం  లో శ్రావణ మాసం మొదటిది . దీనితోనే చాతుర్ మాస దీక్ష , సోమవార ఉపవాస దీక్ష కూడా ఆరంభ మై  ఈ 4 నెలలలో మొత్తం 16 సోమ వారాలూ ఉపవసిస్తారు ఉపాసకులు . శ్రావణ లో  వర్షాలు బాగా పుంజు కొంటాయి . కొత్త నీరు వలన కామెర్లు, విరోచనాలు మొదలైన నీటి సంబంధ వ్యాధులు వ్యాపిస్తాయి . అన్ని జంతువులూ సంతానోత్పత్తి లో నిమగ్న మై ఉంటాయి . ఈగలు,దోమలు విపరీతం గా పెరిగి అంటు వ్యాధుల వ్యాప్తికి హేతువు అవుతాయి . ప్రజలలో రోగ నిరోధ శక్తి కూడా బాగా తక్కువ ఉంటుంది . అందుకే ఈ మాసం లో జంతు వధని,మాంస భక్షణ ని  నిషేధిం చింది సనాతన ధర్మం . శ్రావణ మాసం లో నకారాత్మక దృక్పధం(negative mentality) ఉధృతమై ,మనుషులు కామ ప్రకోపం , ఇంకా నానా రకాల కోరిక లతో ఉక్కిరిబిక్కిరి అవుతారు . కాబట్టి , మనస్సు కుదురు గా ఉండ టానికి వ్రతాలు,ఉపవాసాలు ,పూజలు ప్రతిరోజూ చేయ వలసింది గా సనాతన సంప్రదాయం చెబుతుంది...

Ego ?

ఇహం లో అహం ఉండాలా ? పరానికి అహం నిరొధమా ?  అహంకారం అంటే ఏమిటి? "నేను,నాది,నేనే," అనే భావ మే అహంకారం .  అహంకారాన్ని క్రమం గా తగ్గించు కోవాలి .  అహం లేక పోతే మనిషి ఎలా పని చేస్తాడు ?  అహం ఉంటే నే కదా పని చేయాలనే ఉత్సాహం ఉంటుంది .  సంపాదనకి ,కార్య నిర్వహణ కు మనిషికి ప్రోత్సాహం, కోరిక ఎలా వస్తాయి ? సంపాదన, దానితో వచ్చే కష్ట నష్టాలు ,సుఖ దుఖాలు  తద్వారా ఏర్పడే బంధాలు ,తరగని కోరికల ప్రవాహం ,దానితో కలిగే తృప్తి,నిరాశ ,ఇదంతా మనిషికి ఒక విష వలయం లా తయా రయి అందులో చిక్కుకు పోయి ఆవేదన,దుఖం ,విసుగు, కలిగి ప్రశాంతత లోపించి అప్పుడు శాంతి,ఆనందాల కోసం ఎదురు తెన్నులు చూస్తాడు.  సంతోష మైనా ,దుఃఖ మైనా కొంత సమయానికి వాటి ప్రభావం కోల్పోతాయి .  అంటే మనల్ని ఎవరైనా కొట్టినా,అవమాన పరిచినా, ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకున్నా ఊరుకోవాలా? నేను - నాది -నాకే జరిగింది -నన్నే తిడ తావా -నన్ను కొడతావా -నా మాట లెక్క చేయరా - నన్ను లోపలికి రానివ్వరా - నన్ను కూడ డబ్బు అడుగుతారా - నా మీద చేయి వేస్తారా -ఇలా సాగుతుంది మనస్సులో మధనం .  ఈ మధనం లో  "నేను ...

జ్ఞానం అవసర మా ?

Image
జంబూ ద్వీప భరత వర్ష భారత దేశ  విజ్ఞానం సనాతనం .-  The Eternal ultimate ultra truth. దేశం ,సంఘం , శరీరం,మనస్సు,ఆత్మ  - ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సఖ్యత లో ఉండాలని , కష్ట నష్టాలు ,సుఖ దుఖాలు కలిసి పంచు కోవాలని , ఆహారం ,మంచి  నీరు అందరికీ సమానం గా అందా లని , సకాలం లో వర్షాలు కురిసి పాడి పంట బాగుండా లని , ఈతి బాధలు ,అంటువ్యాధులు రాకుండా ఉండాలని --- భారతీయులు ప్రకృతిని, దైవా న్ని ప్రార్ధించే వారు . అప్పుడే కాదు ఇప్పటికీ , ఎప్పటికీ  "లోకా సమస్తా సుఖినో భవంతు " అనే హృద్య మైన భావన భారతీయుల మదిలో ఉంటుంది . దీనికి కారణం ఇది వేద భూమి . వేద నాదం ప్రతిఫలించిన గడ్డ . వేదార్ధం తెలియక పోయినా ఆ వేద నాదానికి మంత్ర ముగ్డులవ్వని బిడ్డ ఉండని గడ్డ ఇది . ప్రతి వేద సూక్తానికి మంత్ర ద్రష్ట , ఛందస్సు ,మంత్ర అది దేవత లుంటారు . వేద నాదం నాడీ మండల ప్రశాంతత నిస్తుందని శాస్త్రజ్ఞులు నిరూ పించారు . వేద మంత్రాలు ఆధ్యాత్మిక ,అధి భౌతిక ,అధి దైవిక శాంతి నిస్తాయి . ఐక మత్యం గా ఉండి సంఘాన్ని ,దేశాన్ని బలవత్తరం చేయా లని కోరుకొన్నారు . ప్రక...

సత్యాన్వేషణ లో సనాతన - క్వాంటం తత్వాల జుగల్ బందీ (Who are We?)

నిజానికి  మన మెవ్వరం ? అన్నింటికీ మూల కారణమైన సత్యం ఏమిటి ? ఈ ప్రక్రుతి ,ఈ చరా చర ప్రపంచం , స్థావర జంగమాలు ఎలా పుట్టాయి ?  సప్త ధాతువులు ,దశ వాయువులు , 14 తత్వాలతో ఉన్న మనం ఎలా  ఎక్కడి నుండి వచ్చాం ? మన ప్రయాణం ఎలా చేయాలి? మనకి గమ్యం ఉందా ? లేదా? అణువు నుండి కణాలు,శరీర వ్యవస్థలు ,వీటన్నింటి  అజమాయిషీకి మెదడు ,దానిని కూడా నియంత్రించే చైతన్యం - ఇదంతా ఒక క్రమబద్దమైన రచనా ? లేక అనుకోకుండా జరిగిన సంఘటనా ?  కనబడే దృశ్య జగత్తు (4%),కనబడని అవ్యక్త సత్యం గురించి సనాతన తత్త్వం  చేసి న అన్వేష ణే  ఇప్పుడు క్వాంటం శాస్త్రజ్ఞులు చేస్తున్నారు . (  అవ్యక్తా న్ని వేదాంతం చైతన్యం అంటుంది .  క్వాంటం శాస్త్ర ప్రకారం ,అవ్యక్తం 70% కృష్ణ శక్తి ,26%కృష్ణ పదార్ధం) నేటి భౌతిక శాస్త్రం  ఈ మధ్య నే(19th.century) పరమాణు సైజుని (0.5nanometer)కనిపెట్టింది . సనాతన జ్ఞా నా నికి మహర్షి పరంపర ఉన్నట్లే ,క్వాంటం జ్ఞా నా నికి కూడా మహర్షులున్నారు . వారే - బోర్,హీసేన్ బర్గ్ ,ప్లాంక్ ,ఐన్ స్టీన్ ,డిబ్రోగ్లి ,శ్రొదింగర్ ,పౌలి ,డి...

దారి మరిచిన మనిషి

మా దారి రహదారి అని అహం తో విర్రవీగే మానవాళికి - అది సరే ,దానితో పాటు ఈ రహదారి - 'దైవం దారి' ని కూడా గుర్తు పెట్టుకొని పయ నిం చండి ' అని చెప్పేవి వేదాలు . సరిగ్గా  శ్వాస పీల్చడం కూడా  రాని మనిషి ని శ్వాసాయామం తద్వారా ప్రాణాయామం చేయమని , ఇడా  పింగళ నాడుల ద్వారా నడిచే శ్వాస ను సుషమ్నా నాడి ద్వారా నడిపించా లని చెబుతారు యోగులు . సగటు మనిషి కి తన ఎరుకలో లేని విషయా లైన ఆత్మ ,అంతఃకరణ ,నాడీ శోధన , చిత్త శుద్ది -వీటి గురించి ఎంత చెప్పినా ఇష్ట పడరు . వారికి కనీస అవసరాలు తీరాలి . ఉదృతం గా వస్తున్న  కోరికలు తీరాలి . ఎప్పటి కప్పుడు మారే  కోరికల హోమాగ్ని లో    ఇంద్రియాల ద్వారా సమాచారం వేస్తూ ఉండాలి . ప్రస్తుతం ప్రతి మనిషీ ,  కంటికి కనిపిస్తున్న వాస్తవాన్ని  ఆధారం చేసుకొని బతుకు తున్నాడు .  అది వాస్తవం కాదు ,అసంపూర్ణ సత్యమే (మిధ్య ) అని తత్వ వేత్తలు ,మహర్షులు ఎంతగా చెప్పినా వినే సమయం ,అవసరం ,ఓపిక లేవు . ఈ బతుకు ఒక కల లాంటిదని ఎంత మొత్తుకొన్నా , ఆకలి,దాహం ,సుఖ లాలస ని ఎవరూ కాదన లేరు .  నిజం చెప్పా లంటే ,స్పందనలు లేని స్థిర చైతన్యానికి(దైవమ...

సనాతన ధర్మం

The eternal cosmic law:సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే అది ఏదో భారత దేశానికి ,హిందూ మతానికి  సంబంధించిన వ్యవహారం కాదు . అది ప్రక్రుతి మరియు పురుషుని అనగా దైవానికి సంబంధించిన మార్చ లేని సూత్రం . పదార్ధానికి గురుత్వ ఆకర్షణ ఉండటం ఎంత నిజమో ఇదీ అంతే . సూర్యుడు మన పాల పుంత నాభి చుట్టూ ప్రదక్షిణం  చేస్తుం టే ,ఆ సూరుని చుట్టూ భూమితో పాటు సౌర కుటుంబ గ్రహాలూ పరిభ్రమిస్తున్నాయి . అదే విధం గా సనాతన ధర్మం మన సృష్టికి ఆలంబన గా ఉంది . గ్రహాల కదలికల గురించి , వస్తువుల పై పడే బలాల గురించి   కెప్లర్ ,న్యూటన్ సూత్రాలు ఎలా మనం మతాలకు అతీతం గా చెప్పు కొంటున్నా మో , సనాతన ధర్మ సూత్రాలూ అంతే . 1. దైవం లోని 99% అవ్యక్తం గా ఉండి ,కేవలం  1% విభూతి నుండి సకల చరాచర విశ్వ ము వ్యక్త మయ్యింది . వ్యక్త మైన విశ్వం 3 గుణాల కలయిక . అవ్యక్త చైతన్యం త్రిగుణా తీతం . 2. అనేక రూపాలలో ,వివిధ నామాలతో గుళ్ళలో ,ఇళ్ళలో పూజలు,వ్రతాలు ,క్రతువులు , కాండలు ,తంత్రాలు ,జపము ,తపము ,యజ్ఞము ,దానము చేసినా అహం కరగక పోతే  ఆత్మ పరమాత్మ ఒక్కటే అనే స్థితి కి చేరు కో లేరు . సాత...

ఇదే మనిషి కధ

కోటానుకోట్ల జనం లో 99. 9% మామూలు నేలబారు మనుషులే .  కనీస అవసరాల కోసం  నిత్య పోరాటం, అరిషడ్ వ ర్గాలతో నిత్య పితలాటకం వారికిఉండనే ఉంటుంది . వీరిని క్రమ శిక్షణ లో పెట్టవలసిన బాధ్యత అందరిదీ . ముఖ్యం గా గురువులు,పాలకులది . మానవ జాతి పరిణామం అలా జరిగిందే .   వేట ,నిప్పు  ని రగిలించి ఉపయోగించడం ,జీవాల పెంపకం , వ్యవసాయం , రక్షణ కోసం కొండ గుహలలో నివాసం ,తర్వాత మట్టి ఇళ్ళు , ఆ తర్వాత గట్టి ఇళ్ళు ,రాతి ఆయుధాలు ,కంచు,ఇనప పనిముట్లు ,చక్రం, విల్లంబులు ..  ఆ తర్వాత ఎప్పటికో తుపాకి,విద్యుత్ , .... అణుబాంబులు .... వివిధ మానసిక   బౌద్ధిక స్థాయిలలో ని ప్రజలందరూ  తమలో తాము గొడవలు లేకుండా ,అదే సమయం లో ప్రకృతిని నాశనం చేయ కుండా, చేత నైతే ఎదుటి వాడికి, ప్రకృతికి   తోడ్పాటు అందించగల ఏర్పాటు చేయాలని సామాజిక శాస్త్ర వేత్తలు ,సంఘ సంస్కర్తలు భావించారు . తత్వ వేత్తలు సమాజం లో భౌతిక భావనల కన్నా ఆద్యాత్మిక భావనలు వెల్లి  విరియాలని తలపోశారు . మనిషి ఎక్కువ కష్ట పడకుండా సుఖాలు పొందాలని ,ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని ,మనిషి ఉత్పాదకత పెంచి ద...

సర్వమూ స్పందన మయం

 కణాద మహర్షి ,భౌతిక వస్తువులని విభజించు కొంటూ చివరకు ఇంకా విభజించ సాధ్యం కాని కణం గురించి చెప్పాడు . అలాగే,కపిల మహా ముని సాంఖ్య శాస్త్రం లో ప్రాణుల,ముఖ్యం గా మనిషిలో ఉన్న విభూతులను అనేక తత్వాలుగా విభజించారు . పంచ భూతాల కలయికతో ఏర్పడిన -శరీరం ,ఇంద్రియాలు ,అంతః కరణం ,బుద్ది , ప్రాణం -ఇవన్నీ అపరా ప్రక్రుతి అని , జీవాత్మ పరా ప్రక్రుతి అని వ్యవహారికం గా చెప్పారు . అంతః కరణం ,బుద్ది, ఆలోచనలు ,కర్మలు --- ఇవన్నీ కూడా మూడు గుణాల ద్వారా 3 విధాలుగా ఉంటాయని తేల్చారు . అవే సాత్విక ,రాజసిక, తామసిక విధాలు .  వేర్వేరు స్థాయిలలో ఉన్న స్పందనలే గుణాలు . కనపడే ఈ విశాల విశ్వం అంతా వివిధ రకాల స్పందనల లో ఉన్న శక్తి . ఎలాంటి స్పందనలు లేక సమ స్థితిలో(static potential) ఉన్న చైతన్యం లో ముందుగా ప్రకాశం ఆ తర్వాత స్పందనలు(vibrations) ,ఆ స్పందనలు ఎన్నో లక్షలు,కోట్ల విధాలుగా సమీకరణం(combinations&permutations) చెంది  వ్యక్త (manifestation) మవ్వడమే సృష్టి . కపిల మహర్షి స్పందనలను స్థూలం గా 3 విధాలుగా వర్గీకరించాడు . అవే -సాత్విక ,రాజసిక ,తామసిక స్పందనలు . ...

కోస్తా ప్రాంతానికి హె చ్చరిక

సముద్ర తీర ప్రాంతాలలో వరి వ్యవసాయం ఒక విధం గా మనిషికి గుప్పెడన్నం పెడుతుంది . అలాగే వాతావరణం లోని హానికర మైన బొగ్గు పులుసు వాయువుని పీల్చుకొని మేలు చేస్తుంది . అంతే గాక మళ్లకు గట్లు కట్టడం వలన నీరు నిలవ ఉండి ,భూమి పై పొరల్లో కి సమీప లవణ జాలం ఎగదన్న కుండా ఉంటుంది . వాన నీరు కూడా పరిగెత్తకుండా మళ్ళలో నిల్వ ఉండి  భూగర్భ జలాలు చార్జ్ అవుతాయి . భూమి కోత పడకుండా ఉంటుంది . వరి పొలాలే లేకుంటే తిండి కరువోక్కటే  కాదు , వాతావరణ పరిస్థితి,భూగర్భ జల మట్టం  దారుణం గా ఉంటుంది . కాబట్టి ఎట్టి  పరిస్థితుల్లో తీర మైదానాలలో వరి వ్యవసాయం మానకూడదు . 

భారత జాతి పై దాడి

  1757 లో అది జరిగింది. ప్లాసీ యుద్ధం లో సిరాజ్ ఉద్దవ్లా ఓటమితో రాబర్ట్ క్లైవ్  బెంగాల్ ని ఆక్రమించు కొన్నాడు . భారత జాతి పై సంపూర్ణ ఆధిపత్యం, ఈస్ట్ ఇండియా కంపనీ ద్వారా ఇంగ్లీష్ రాణి చేతిలోకి ,ఆ పై క్రిస్టియన్ మిష నరీ ల మత మౌడ్య జాత్యహంకార కోరల్లోకి చిక్కింది . 1757 తర్వాత సుమారు 70 ఏళ్ళు సంస్కృతం లో ప్రావీణ్యం పొంది న వివిధ ఇంగ్లీష్ , జర్మన్ తత్వ వేత్తలు (చార్లస్ విల్కిన్స్ , విలియం జోన్స్ ,థామస్ కోల్ బ్రోక్,రుడాల్ఫ్ రోత్ , స్లీగల్ సోదరులు , ఆర్ధర్ షోపెన్ హెయిర్)- భగవద్గీత ,ఉపనిషత్ లు ,వేదాలు , కావ్యాలపై  వ్రాసిన వాఖ్యానం చదివిన పాశ్చాత్యులు , భారతీయుల జ్ఞాన సంపద ,ఆయా భావజాలం యొక్క ఉత్క్రుష్టత చూసి ఆశ్చర్య పోయారు . యూరప్ లో ఆవిధం గా మంచి ప్రాచుర్యం పొందుతున్న సనాతన భావ జాలం ని చూసి జ్యూస్ , ఇంగ్లీష్ క్రిస్టియన్ మిష నరీ లు కంగారు పడి, ఏ విధం గా నైనా సంస్కృత భాషని బ్రష్టు పట్టించి భారత సంప్రదాయాల పై అసహ్య భావం కలుగ చేసి ప్రపంచ ప్రజలలో నే కాదు భారత యువతలో కూడా భారత సంస్కృతీ పై హేళన ,ఎగతాళి , నిర్లిప్తత కలగ చేయడానికి ఓ పెద్ద కుట్ర పన్నారు . దా...