భారతీయం -పార్ట్ 2
భారతీయం -పార్ట్ 2
ఈ ప్రపంచంలో చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు మన దేశం వయసు. ఇదీ మన భారత్
గొప్పతనం . ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన
"ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు
గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
.
వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి . విశ్వవిజేత అనిపిలిచే అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు. ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు.
ఇలా
...అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా .... ఇలా 27 దేశాలు నేడు
లేవు .
ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే..."నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి..."శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది . రోమ్ మీద కేవలం 7,8 సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది .
మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
1. శకులు, 2. తుష్కరులు, 3. మొఘలులు, 4. సుల్తానులు, 5. నవాబులు, 6. షేక్ లు, 7. పఠాన్ లు, 8. పోర్చుగీస్ వారు,
9. ఫ్రెంచ్ వారు, 10. డచ్ వారు, 11. బ్రిటీష్ వారు...
ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం ......! ఏమి చేయ లేక పోయారు అని చెప్పుకొంటాం. . ఇది నిజమేనా? భౌతికంగా ఏమీ చేయలేకపోయినా, భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు , శాస్త్రములు , ఆచారాలపై అవహేళన,అపనమ్మకం ,
భారత దేశభాషలపై చిన్నచూపు, నల్ల వారి చర్మం రంగు పై నూన్యత , తెల్లవారేమి చెప్పినా నమ్మేయడం , తెల్లవారి భాషలపైనా, ఆచారాలపైనా గౌరవం , తెల్లవారి గ్రంధాలపైనా, వారి మాటలపైనా మక్కువ తదితర ఆత్మ నూన్యతా బానిస మనస్తత్వాన్ని మన దేశస్తుల మనస్సులో బలంగా నాటడం లో విదేశీయులు ముఖ్యంగా ఆంగ్లేయులు సఫలీ కృతులయ్యారు.
ఇదే విషయాన్ని భారతీయుల అనువర్తన యోగ్యత ( ADAPTABILITY) మరియు సర్దుబాటు ( ADJUSTMENT) మనస్తత్వం గా కూడా చెప్పుకోవచ్చు. భారతీయులు గడ్డిమొక్క ల్లాంటి వాళ్ళు . ఎంత వరదొచ్చినా మానులు విరిగి కొట్టుకుపోతాయిగానీ, గడ్డి మొక్కలు తిరిగి లేచి నిలబడతాయి .
మార్క్స్, ఎంగెల్స్ లాంటి గతితార్కిక భౌతిక వాదులు, పురాతన కాలంలోని చార్వాకుల మాదిరిగా వాదించే హేతువాదులు , ధర్మశాస్త్రం చెప్పినట్లుగా సామాజిక సమతుల్యత ,ఇలా ఎవరేమి చెప్పినా ఆయాకాలపు సమస్యల పరిష్కారానికి చెప్పిన సాపేక్ష న్యాయ శీలనమే తప్ప ఏదీ పూర్ణమైన పరిష్కారం కాదు,ఏదీ సంపూర్ణ సత్యం కాదు. మార్పు సహజం . దేహములోనూ ,ఇటు బాహ్యప్రకృతిలోనూ మార్పు అనివార్యం.
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత
కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా
భారత దేశం" ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం .
మరి దేశభక్తుల విషయం...
1857
మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో
ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు
పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
మరి
ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ
ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది . ఎందుకంటే దెబ్బలు తిన్నాక
కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి . ఇది నా దేశంలో
పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా
దేశాన్ని విమర్శిస్తారు.
మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది
ఎంత?
·
900
సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ ప్రపంచానికి తెలిపాడని
అంటున్నారు !
·
2000
సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి
ప్రపంచానికి తెలిపాడని అంటున్నారు ! .
·
5000
సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి .
·
1400
సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
Comments
Post a Comment