పుష్కరాల అంతరార్ధం
గోదావరి పుష్కరాల మహోత్సవం .
సనాతన భారతా వని లో మానవ జీవితం ఓ మహా ప్రస్తానం . పంచ భూతాలను పంచ జ్ఞానేం ద్రియాలతో ఆస్వాదిస్తూ , కృతజ్ఞత గా పంచ కర్మేం ద్రియాలతో కొలిచే సంస్కారమే భారతీయత .
పంచ కోశాలు శుద్ది చెంద డానికి అనువైన కాలమే పర్వ దినం,అనువైన ప్రదేశ మే తీర్ధం .
జలం... అది బయటా ఉంది , మన లోపలా ఉంది .అలాగే మిగతా నాలుగు భూత తత్వాలూ !
నీటిలో ని శక్తికి , సృష్టి లోని శక్తులు మరింత గా తోడై ఉండే సమయం పుష్కరం .
మానవ శరీరం కూడా అధిక మొత్తం నీటితో తయా రయ్యిం దే !
నీటి లోకి విద్యుత్ ని పంపితే నీరు, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ గా విడి పోతుంది . ఇది ఆక్సి దేషన్ చర్య .
మర ల ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ కలిసి నీరు ,దానితో పాటు కొంత విద్యుత్ పుడతాయి .
ఇది క్షయీ కరణ చర్య .
అపార జలరాశి లోకి మనం విద్యుత్ ని పంపలేము . శక్తిని పుట్టించ లేము . కానీ , మనం చేయ లేనిది ప్రక్రుతి చేస్తుంది . అలా చేసే సమయమే పుష్కరం .
భరత వర్షం లో అత్యంత ముఖ్య మైన అనగా విశ్వ శక్తులు అత్యధికం గా ప్రసరిమ్చ డానికి అను వైన ప్రదే శాలలో ఉన్న 12 నదుల లో , ఆ విశ్వ శక్తి ఉత్సర్గం చెందుతుంది.
ఏ సమయం లో ఏయే నదులలో ఆ విధమైన శక్తి ఉత్సర్గం జరుగుతుందో తెలుసు కోవడానికి కొన్ని సూత్రాలు తెలియ చేశారు మన మహర్షులు .ఒకో నదికి సంకేతం గా ఒకో రాశి ని గుర్తించారు .
గురు గ్రహం ఒకో రాశి లో ప్రవేశం చెందే సమయమే ఆయా నదులకు పుష్కర సమయం అని రుషి ఉవాచ .
నదికి కొత్త శక్తి ఒన కూడే సమయం . ఇది మానవ కోటికి పర్వ దినం .
సనాతన ధర్మం లో పర్వ దినాలు మానవ జీవితాలలో ఓ ఉత్సవం .
సమాజం ఓ వసుధైక కుటుంబం లా ప్రవర్తిం చే సమయం .
తీర్ధ స్నానం చేసినప్పుడు ,అది పుష్కరిణి లేదా చెరువు ,నది ఏదైనా సరే దానిలోని మట్టి 3 గుప్పెళ్ళు తీసి ఒడ్డున వేయాలి . ఒడ్డు చుట్టూ ఉన్న మట్టి లో ఎలాంటి అశు భ్రత లేనప్పుడు మాత్రమే , మంత్రం జపం చేస్తూ మట్టిని వంటికి రాసుకొని ,ఆ తర్వాత నదీ స్నానం తర్పణ పూరితం గా చేయాలి .
ఈ సమయం లో ఆ నదిలో స్నానం చేయడం ద్వారా శరీరాన్ని , దానం చేయడం ద్వారా కర్మ శరీరాన్ని , మంత్ర జపం తో మానసిక శరీరాన్ని శుద్ధి చేసుకొని -
తర్పణ మిచ్చి పితృ దేవతలను ,
అంజలి ఘటించి సూర్య భగ వానుని,
స్మరణతో నారాయణుని ప్రార్ధించి , --
నదీమ తల్లి పరిసరాలను కూడా శుభ్ర పరచి ,అర్హులకు .బ్రహ్మ వేత్తలకు ,ఆర్తులకు శక్తి కొలది సాయం చేయాలి .
నది మూలం ,రుషి మూలం గురించి మనం తెలుసు కో నక్కర లేదు . ఆ నదీమ తల్లి తను పరవశిస్తూ ,తన దారిలో మానవ కోటిని పరవ శింప చేస్తూ వడి వడి గా ఉరకలెత్తు తూ ఎలా పరవళ్ళు తొక్కుతుం దో చూద్దాం రండి !
సకల తీర్ధాలకు రాజైన పుష్కరుడు ,సకల దేవతలకు గురువైన బ్రిహస్పతి ,బ్రహ్మాది దేవతలు ,పితృ దేవతలు అంతర్లీ నం గా నదీ జలాల లో తన్మయు లై ఉన్న సమయం ఇదే ! తరించడానికి తరలి రండి .
" కృతజ్ఞత - సుహృద్ భావం -భగవంతుడి పై విశ్వాసం - మహా సంకల్పం -శరణాగతి" -ఇవే మనం గుర్తుంచు కోవలసిన వి . మన పిల్లలకు నేర్ప వలసినవీ ఇవే ! ఇదే ఆర్ష ధర్మం ...
Comments
Post a Comment