మనిషి ప్రతిభావంతం గా ఉండా లంటే ఏం చేయాలి ?
జీవితానికి అర్ధం పరమార్ధం ఉండాలంటారు పెద్దలు .
అర్ధం తెలుకోవడానికి ఎవ్వరూ ఇష్ట పడరు . తోచిందేదో చేయడమే తప్ప , ఓ నిర్దిష్ట
లక్ష్యం , పధక రచన , కార్యాచరణ అనేవి 90% మందికి ఉండవు . అంతా గాలివాటం !
భగవంతుడు మనిషికి తార్కిక శక్తిని ఇచ్చింది మంచి -చెడు కి తేడా తెలుసు
కోవదానికే తప్ప అనవసర మైన ఉసు పోక విషయాలను విస్లేశించ మని మాత్రం కాదు .
మనిషికి ఉహ శక్తిని ఇచ్చింది సామర్ధ్యానికి అనుగుణ్య మైన కలలు కనమని
... అంతే గానీ మన సామర్ధ్యానికి అందుబాటులో లేని పగటి కలలు కనమని మాత్రం కాదు .
సాధారణ మానవుడు తన విజ్ఞానానికి ఏ మాత్రం సంబంధం లేకుండా చేయగల
అత్యంత ముఖ్య మైన కార్యం .... తన శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచుకోవడం , తన మనస్సుని సంతోషం
గా మిగుల్చు కోవడం ....తన బుద్ధిని పదునుగా అంటే వివేకం తో ఉంచుకోవడం .
యుక్తా - అయుక్త విచక్షణ అనేది సంఘ సంక్షేమానికి సంబంధించిన
విచక్షణ .
ధర్మ -అధర్మ విచక్షణ అనేది ప్రక్రుతి కి సంబంధించిన వ్యవహారం
...
మనిషి జన్మకి అర్ధం ఏమిటి ?
అర్ధ , కామాలను సాధించు కోవ డ మే మనిషి జన్మకి అర్ధం !
అవి ఎలా సాధించు కోవాలో తెలుసు కోవడమే మనిషికి ,మృగానికి తేడా !
తెలుసు కొన్న దానిని నమ్మి ఆచరించడ మే సామాన్యుడికి ,ప్రతిభావంతుడికి ఉన్న
తేడా !
అర్ధం అంటే అష్ట ఐశ్వర్యాలు .
కామం అంటే విషయాలపైన , మనుషుల పైన , సంఘటనల పైన కోరికలు .
అంటే , అర్ధ కామాలను పొందడానికి మనిషికి ఉన్న బలాలు ( ఆయుధాలు) ,బలహీనతలు
ఏమిటి ?
రాగ ద్వీషాలు , అరిషడ్ వర్గాలు మొదలగు గుణ సంపత్తి మనిషి బలహీనతలు
. ఇవే బలహీనతలు మృగాలకు ,కీటకాలకు , పిపీలికానికి .... అంతెందుకు ప్రతి జీవ కణానికి
ఇవన్నీ వేర్వేరు స్థాయిలలో ఉంటాయి . మనుగడ సాగించడానికి వాటికి ఉన్న బలము
- బలహీనత ఇవే !
కానీ మనిషికి, భగవంతుడు లేదా ప్రక్రుతి కొన్ని సంపదలు ఇచ్చింది
.
అవే తార్కిక -విచక్షణ -వివేక సామర్ధ్యం ;
సమాచార బట్వాడా కోసం మాట,ఆట, పాట , సంగీతం, తాళం , నాదం
, సంజ్ఞా , లిపి ,భాష ...
జ్ఞాపక శక్తి ; ఉహా శక్తి ;
ఇవి మనకు తెలిసి , మనిషికి మాత్రమే ఉన్న మానవ సంపదలు !
ఈ మానవ సంపదలను ఏకాగ్రతా చిత్తం తో ,ఇష్ట పూర్వకం గా ,నైపుణ్యం తో ఉపయోగించు
కొంటూ కార్యాచరణ చేసే వాడే ప్రతిభావంతుడు !
జీవితానికి ఒక మిషన్ ' ని ఏర్పరచు కొని దానిని సాధించ దానికి కావలసిన
పధకాల ను చిన్న చిన్న విషయాలను కూడా వదిలి పెట్టకుండా ... కూలంకుషం గా
ఆలోచించి సిద్ధం చేసుకోవాలి . ఒక పధకం పనిచేయకపోతే రెండో పధకాన్ని కూడా ఆలోచించి సిద్ధం
చేసుకోవాలి .
పధకం సిద్ధమైన తర్వాత వెంటనే .... ఏమాత్రం ఆలస్యం లేకుండా అమలు పరిచే చర్యలు
ఆరంభించాలి .
విమర్శలు ,సలహాలు ,...ఎన్ని వచ్చినా పధకం ప్రకారం దూసుకు పోవాలి తప్ప వెను
కడుగు వేయకూడదు . ఎందుకంటే ఆ పధకం లో ఉన్న సాధక బాధలు , ఆ పధకం వెనక ఉన్న లక్ష్యం పై
నీ కంటే వేరెవ్వరికీ అవగాహన ఉండదు .
అవసరం లేని చోట , అనవసర మైన విషయాలలో తలదూర్చి సమయం వృధా చేసుకోవడం సామాన్యుల
విషయం లో జరుగుతుం ది . కానీ ప్రభావ శీలురు , ప్రతిభా వంతుల లో -
అనవసరమైన వారి కి , పనికి రాని పనులకు "లేదు " అని
చెప్పగల సత్తా ఉంటుంది .
పని పై ఏకాగ్రత ఒక్కటే సరిపోదు . పని పై ఆత్మ వంచన లేని ఇష్టం
ఉండాలి . లేని ఇష్టాన్ని నటించినా నష్ట పోయేది మనమే . ఏకాగ్రత తో పాటు, చేసే పనిలో
నిపుణత లేక పోతే ఫలితం రాదు గదా ?
అంటే ఒక పని ,సఫలీ కృత మవ్వా లంటే , ఏకాగ్రత ,ఇష్టత
, నిపుణత .... ఈ మూడూ ఉండాలి . ప్రతిభావంతులకు ఇవన్నీ ఉంటాయి .
మనం చేసే పనిని సాధించు కోవడానికి మన పధకాలను అమలు చేసు కోవడానికి ఎలాంటి
అభ్యంతరాల నైనా మనకు అడ్డు రానీయ కూడదు .
తొందర పాటు ఉండ కూడదు . సరైన సమయం కోసం వేచి ఉండే ఓర్పు ఉండాలి .
ప్రతి దాంట్లో వేలు పెట్ట కూడదు . అలా పెడితే ,ఎందులోనూ ఫలితం సాధించ లేము
.
మన చుట్టూ కూడా ప్రతిభా వంత మైన వాతావరణం ఉంచు కోవాలి . స్నేహితులు
,పుస్తకాలు ... ఎవరైనా ఏదైనా మన లక్ష్యానికి సాయం చేసే వారు మాత్రమే ఉండాలి .
సంగీత సాహిత్యాలు మన లను ఉత్తేజ పరచాలి . సకారాత్మక ఉత్తేజం అందించే
వ్యవస్థని మన చుట్టూ మనం నిలబెట్టుకోవాలి .
కొంత మంది ప్రతి సలహాకి విలువ ఇవ్వడానికి ప్రయత్నించి , చివరకు అంతా కలగా
పులగం చేస్తారు . వీరికి విజయం దక్కదని వేరే చెప్ప నక్కర లేదు . మరి
కొంత మంది అందరినీ తృప్తి పరచడానికి ప్రయత్నం చేసి చివరకు ఎవ్వరినీ సరిగ్గా
తృప్తి పరచ లేక పలుచన అవుతారు .
కొంత మంది రాబోయే విషయాల గురించి , జరిగి పోయిన సంఘటనల విశ్లేషణ ల గురించి
తెగ చెప్పేస్తా ఉంటారు .
ప్రతిభావంతులు భూత భవిష్యత్ విషయాలను వారి లక్ష్యానికి అనువుగా అవసర
మైనంత వరకు వాడుకొంటారు . అంటే గతం లో జరిగిన తప్పులు మళ్ళీ చేయరు . గతం లో జరిగిన
విషయాల నుండి తనకు కావలసినంత వరకు విజ్ఞానాన్ని వాడు కొంటారు . అలాగే భవిష్యత్ లో తన
పధకాల తీరు తెన్నులను ఇప్పుడే ఉహించి దానికి తగ్గ విధం గా తన పనిని , పని చేసే నిపుణతను
మెరుగు పరచుకొంటారు .
కల లు కనడం వేరు . పగటి కల లు కనడం వేరు .
కల మన ద్రుక్ఫదానికి , మన సామర్ధ్యానికి అనువైన దై ఉండాలి . అంటే, మన బలం
,బలహీనతలు మనకు తెలిసి ఉండాలి . ఎదుటి వాడి బలాబలాల కంటే ముందే, మన సామర్ధ్య
మేమిటో మనకు అవగాహన ఉండాలి . మానసిక పరమైన అవగాహన ఒ క్కటే సరిపోదు . పనిచేస్తూ
ఉంటేనే మనకు ఎక్కువ అవగాహన కలుగుతుంది . ఎక్కడ తప్పులు చేస్తున్నామో , ఎవ్వరి వలన
... ఎ విషయాల వలన ఆయా తప్పులు జరుగు తున్నాయో అప్పుడే బాగా అర్ధం అవుతుంది
.
కొంత మంది రాబోయే మార్పులు గురించి తెగ వాగుతా ఉంటారు .
ప్రతిభా వంతులు ఆ మార్పే తామవ్వుతారు ! ఆ మార్పుని వీళ్ళే పట్టు
కొస్తారు . ఆ మార్పుతో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ నే ఉంటారు .
మరి , మనిషికి పరమార్ధం ఏమిటి ?
తన కర్మ ఖాతాలో ఉన్న కర్మలను భస్మం చేసుకోవడానికే మనిషి ఈ భూమి పై
పడ్డాడు .
ఇది పరమార్దానికి చెందిన విషయం .
మనిషి కి ప్రశాంత మైన నిత్యానంద స్థితి కావాలీ అంటే ,ఈ మానవ సంపదలు సరి
పోవు .
వేరే సంపదలు కావాలి .
శుచి - శౌ చ్యమ్ , దైర్యం ,నమ్మకం, శ్రద్ధ ,కరుణ ,ప్రేమ ,సేవా నిరతి
,దయ , దానం -ఇవే మనిషి సాధించు కోవలసిన బలాలు . వీటినే మానవీయ సంపదలు లేదా
సాధనా సంపత్తి అంటారు . ఎందుకంటే అభ్యాసం తో సాధించు కోవలసిన మానసిక లక్షణా లివి !
సాధనతో సమ కూరే సంపదలివి .
మానవీయ సంపదలకు ఆధారం ధర్మం ! మానవీయ సంపదలకు ఆకారం సత్యం !
దీనినే సనాతనులు - " సత్యం వద ... ధర్మం చర " అని సూక్ష్మం గా
చెప్పారు .
అర్ధ , కామాలను ధర్మ బద్ధం గా పొంద డానికి మానవీయ సంపదలు సాధించుకోవాలి
. దీనికి రెండు మార్గాలు . అవే , ప్రవ్రుత్తి (గృహస్థు ) మరియు నివృత్తి ( సన్యాసం
) మార్గాలు .
బాహ్య పరమైన పూజలు ,నామ సంకీర్తనలు ,రాజసిక దాన -తపో -యజ్ఞ కర్మలు ఇవి
మొదటి మెట్టు ....
శరణాగతి , ప్రార్ధన , భక్తీ ,జ్ఞానం ,ధ్యానం , సాత్విక కర్మ ఫలసన్యాసమ్
అనేవి కొంచెం పై మెట్టు పైన ఉన్న మార్గాలు .
మెట్టు మెట్టు గా సాగిపోయి కాన్షస్ ను విశ్వ వ్యాపితం చేసుకొంటూ అపరోక్షాను
భూతి చెందడమే జీవిత పరమార్ధం. వీరే ద్రష్టలు,స్రష్టలు, మహర్షులు, జీవన్ముక్తులు గా
విఖ్యాతి పొందుతారు.
స్వస్తి..
Comments
Post a Comment