మత దోపిడీ

ప్రజలను,సంఘాన్ని,దేశాన్ని  మతం పేరుతో చీల్చి వేస్తున్నారు . 

మానవ సంబంధాలకు ,దేశ ప్రగతికి మతం ముడి పెట్ట కూడదు అని రాజ్యాంగం లో వ్రాసుకొని
అడు గుఅడు గు నా అదే మతాన్ని అడ్డు పెట్టు కొని చేసే అన్యాయపు చర్యల వలన ప్రజలలో మత పర మైన ఘర్షణలు ,విద్వేషాలు రోజు రోజు కీ పెరిగి పోతున్నాయి .
అమాయక ప్రజలు బడా రాజకీయుల చేతిలో కీలు బొమ్మలై , వారు వేసే సంక్షేమ  బిచ్చానికి
 ఎదురు చూసే విధం గా సామాన్యుల బుర్రలను వాష్ చేస్తున్నారు .

ఏ మతాన్ని ఐనా నిజం గా ఆచ రించే వారు ఎప్పుడూ  సద్బుద్ధి తో నే ఉంటారు .
కానీ, మత పెద్దలు ,  రాజకీయ పార్టీలు...   డబ్బుకి అమ్ముడు పోయే  అమాయక ప్రజల పేదరికాన్ని
అడ్డుపెట్టుకొని అరాచకాలు ,ఉగ్రదాడులు చేయిస్తున్నారు .

అలాగే ,మానవ హక్కుల పరిరక్షణ పేరుతో ఉగ్రవాదులకు  ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాచమర్యాదలు,కారుణ్య వరాలు కురిపిస్తున్నారు . 
మూగజీవాలకు ఉన్నపాటి రక్షణ మన దేశం లోని ఆడు వారికి లేనప్పుడు ,ఈ మానవ హక్కుల సంఘాలు 
ఏం చేస్తున్నాయ్ ?
పార్టీలకు అతీతం గా మనదేశం లో జరుగుతున్న ఈ క్రింది సంఘటనలు , మైనారిటీ ఓ ట్ల కోసమే
అని కొందరు అంటున్నారు . నిజమేనా ?
  • సనాతన ధర్మ వాదులైన కాశ్మీర్ పండిట్ ల పైన,బంగ్లా ,పాకిస్తాన్ హిందువుల పైన జరుగుతున్న అకృత్యాలను ,అత్యాచారాలను పట్టించు కొనే తీరిక ,బాధ్యతా లేని కొందరు 'గాజా' లో జరుగుతున్న గందర గోళం గురించి తెగ రొప్పుతూ గుండెలు బాదు కొంటున్నారు . ఎందుకో తెలుసుగా ? 
  • పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి కొమ్ము కాసే పాలస్తీనా వాళ్ళకి మద్దతు ఇస్తాం . వాళ్ళ పీచ మణి చే ఇజ్రాయల్ కు నిరసన తెలుపుతాం . ఎవరి కోసమండీ ఈ సర్కస్ ? ఇదేనా విదే శాంగ రాజనీతి ? ఐన వాళ్లకు  ఆకుల్లో, కానివాళ్ళకు  కంచాల్లో పెట్టే ఈ పాలసీ కి అర్ధం ఏమిటి ?
  • కొందరు ప్రజా నాయకులు ,దేశ సమగ్రతను కాపాడ తామని ప్రమాణం చేసిన పార్లమెంట్ సభ్యులు బాహాటం గా , నిర్లజ్జగా , ఎలాంటి దేశ భక్తీ ,రాజ్యాంగ భయం లేకుండా ,భారత దేశ సార్వ భౌమత్వాన్ని ,సమగ్రతను ప్రశ్నిస్తూ , పరిహసిస్తూ ,కాశ్మీర్, తెలంగాణా ప్రాంతాల లో వేర్పాటు వాదం పెచ్చరిల్లే విధం గా అవాకులు చవాకులు పేలుస్తూ ఉంటే చోద్యం చూస్తున్న రాష్ట్ర ,కేంద్ర  ప్రభుత్వాల గురించి మనం ఏమను కోవాలి ?
  • మనదేశ  చట్టాలు కొన్ని మతాలకు చుట్టాలా ? రేప్,మర్డర్ ఎవరు చేసినా శిక్షార్హులే కదా ?మరేంటి, కొన్ని రాష్ట్రాలలో రేప్ లు , హత్యలు చేసినా కొన్ని మతాల వాళ్ళని ఏమీ అనకూడ దని గొడవలు చేస్తుం టే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయ్ ?
  • గత పదేళ్ళలో దేశాన్ని భ్రష్ట్టు పట్టించిన ప్రభుత్వాలు మానవ అభివృద్ధి కి సంబంధించిన గణాంకాలను  వక్రీకరించి కొన్ని మైనారిటీ మతాల వాళ్ళు మాత్రమే మెజారిటీ మతానికి చెందిన వారి కంటే అట్టడుగున ఉన్నారని దొంగ లెక్కలు వేయ వలసిన కర్మ దేనికి ? 
  • మెజారిటీ మతస్తుల తీర్ధ స్థలాలు ,మందిరాలను ఎటాక్ చేసి అరాచకాలు చేసినా ప్రభుత్వాలు పట్టించు కోవు కారణం ఏంటి ?
  • మెజారిటీ మతస్తుల ప్రార్ధనా మందిరాల ఆస్తులను ప్రభుత్వం ఎలాంటి అడ్డూ అదుపూ లేకుండా ఖర్చు పెట్టేస్తుంది . అదే మైనారిటీ సంస్థల ఆస్తులను వేలితో కూడా తాకే దైర్యం చేయరు . ఏంటి వ్యత్యాసం ?
  • స్వాతంత్రం వచ్చి 68 ఏళ్ళు అవుతుంది .  అటు చైనాతో ఇటు పాకిస్తాన్ తో ఉన్న సరి హద్దు తగాదాలు పరిష్కరించు కోలేని ఉదాసీనత  ను వదిలించు కోరా ?  
  • సమాన పౌర చట్టం(common civil code) ఇంకెప్పుడు అమలు చేస్తారు ?

సెక్యులరిజం అనే పేరు మాటున ప్రభుత్వాలు,పార్టీలు చేసే ఈ అరాచకాలు దేశాన్ని నిర్దాక్షిణ్యం గా చీల్చి వేస్తున్నాయి .
నిజమైన మత సమానత్వం కోసం ఏ దేశం లో అయినా మైనారిటీ సంఖ్య ఉన్న వారు ఏడుస్తూ ఉంటారు ,కానీ విచిత్రం గా మన దేశం లో 80 శాతం ఉన్న మతస్తులు ఆక్రోసిస్తున్నారు . ఇదేం చిత్రం ....

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి